

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్లో ఆడగలిగే సామర్థ్యం కలిగిన ఆటగాళ్లేనని మాజీ భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. 39 ఏళ్ల వయసులో ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ప్రపంచకప్లో ఆడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆటగాడి ఎంపికకు వయసు కాకుండా ప్రదర్శనే ప్రామాణికంగా ఉండాలని చెప్పాడు. కోహ్లి, రోహిత్ ఫిట్గా ఉండి తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే వచ్చే ఏడాది ప్రపంచకప్లో వారికి అవకాశం ఇవ్వాలని సూచించాడు.
పెద్ద టోర్నీల్లో కోహ్లి, రోహిత్లకు ఉన్న అపార అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని హర్భజన్ పేర్కొన్నాడు. యువ ఆటగాళ్ల ప్రతిభతో పాటు సీనియర్ల అనుభవం కూడా కీలకమని తెలిపాడు. భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్పై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ఆయన ముక్కుసూటి స్వభావం వల్ల కొందరికి ఆయన మాటతీరు నచ్చకపోవచ్చని, అయితే క్రికెట్పై గంభీర్కు ఎంతో మక్కువ ఉందని హర్భజన్ స్పష్టం చేశాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!