
రాజకీయాలు

ఫిఫా ప్రపంచకప్లో రేసిజానికి సంబంధించిన వివాదం చర్చనీయాంశంగా మారింది. శ్వేత ఆధిపత్యవాద చిహ్నాన్ని పోలిన సైగ చేశారనే ఆరోపణలతో ఓ వీడియో ఎనలిస్ట్పై చర్యలు తీసుకోవాలని ఫిఫా వివక్ష పర్యవేక్షణ బృందం సిఫార్సు చేసింది. కురసావ్-జర్మనీ మ్యాచ్కు ముందు అధికారిక ప్రసారంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియాకు చెందిన వీడియో ఎనలిస్ట్ షాన్ ఎవాన్స్ వీడియో విశ్లేషకుల బృందాన్ని పరిచయం చేస్తున్న సమయంలో ‘ఓకే’ సంకేతాన్ని చూపించినట్లు కనిపించారు. ఈ సంకేతం కొన్ని తీవ్రవాద వర్గాలు ఉపయోగించే చిహ్నంగా భావించబడుతుందనే విమర్శలు వచ్చాయి. దీనిపై సమీక్ష నిర్వహించిన ఫిఫా భాగస్వామ్య సంస్థ ఫేర్ నెట్వర్క్ ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. ప్రపంచకప్లో ఆయనకు ఇకపై ఎలాంటి బాధ్యతలు ఉండవని తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!