

భారత మహిళల జట్టు స్పిన్నర్ శ్రీచరణి ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. కెరీర్లోనే అత్యుత్తమంగా 804 రేటింగ్ పాయింట్లు సాధించి.. 800 పాయింట్ల మార్క్ను అందుకున్న తొలి భారత బౌలర్గా చరిత్ర సృష్టించింది. 2011లో మిథాలీ రాజ్ సాధించిన 780 పాయింట్ల భారత రికార్డును శ్రీచరణి అధిగమించింది.
అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన మహిళల టీ20 బౌలర్ల జాబితాలో శ్రీచరణి రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా బౌలర్ మేగన్ షట్ 806 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆమె రికార్డుకు శ్రీచరణి కేవలం రెండు పాయింట్ల దూరంలో ఉంది. ఆసియా కప్లో 14 వికెట్లు తీసిన దీప్తి శర్మ నాలుగు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకుంది. బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో షఫాలీ వర్మ ఆరో స్థానానికి చేరుకోగా.. స్మృతి మంధాన ఐదో, హర్మన్ప్రీత్ కౌర్ పదో స్థానాల్లో కొనసాగుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!