

దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో థాయ్లాండ్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో హాంకాంగ్ను 6 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన థాయ్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. కెప్టెన్ నరుమోల్ చాయ్వై 31 బంతుల్లో 43 పరుగులతో జట్టు తరఫున అత్యధిక స్కోరు సాధించారు. ఆమె ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. హాంకాంగ్ బౌలర్లలో మరీనా 4 వికెట్లు పడగొట్టింది.
121 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ ఒక దశలో 84/3తో విజయం దిశగా సాగింది. అయితే చివరి దశలో థాయ్లాండ్ బౌలర్లు పుంజుకోవడంతో హాంకాంగ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరకు 20 ఓవర్లలో 7 వికెట్లకు 114 పరుగులు మాత్రమే చేసి 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కారీ చాన్, యాస్మీన్ చెరో 28 పరుగులు చేయగా, మరీనా 11 బంతుల్లో 22 పరుగులతో వేగంగా ఆడింది. అయినప్పటికీ హాంకాంగ్కు విజయం దక్కలేదు. తదుపరి మ్యాచ్లో యూఏఈతో శ్రీలంక తలపడనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!