

ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ వరల్డ్కప్లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఐదో స్థానంలో నిలిచింది. గురువారం నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్వీన్లో జరిగిన 5-6వ స్థానాల వర్గీకరణ మ్యాచ్లో భారత్ 3-1తో ప్రపంచ ఐదో ర్యాంకర్ జర్మనీని ఓడించింది. దీంతో 1974లో తొలి ప్రపంచకప్లో నాలుగో స్థానంలో నిలిచిన తర్వాత.. 52 ఏళ్లలో భారత్కు ఇదే అత్యుత్తమ వరల్డ్కప్ ఫినిష్గా నిలిచింది.
తొలి 30 నిమిషాల్లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. అయితే మూడో క్వార్టర్లో భారత్ దూకుడు పెంచింది. 43వ నిమిషంలో ఇషిక ఫీల్డ్ గోల్తో ఖాతా తెరవగా, 44వ నిమిషంలో నవ్నీత్ కౌర్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచింది. 47వ నిమిషంలో మరో ఫీల్డ్ గోల్తో నవ్నీత్ డబుల్ పూర్తి చేసి భారత్కు 3-0 ఆధిక్యం అందించింది. 59వ నిమిషంలో లిన్ క్రింగ్స్ జర్మనీ తరఫున గోల్ చేసినప్పటికీ.. భారత్ 3-1తో విజయం సాధించి టోర్నీని ఘనంగా ముగించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!