

చిన్నారుల ఆన్లైన్ భద్రత, గోప్యతకు సంబంధించిన కేసులో టిక్టాక్ అమెరికా న్యాయ విభాగంతో రాజీ కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా 400 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఈ మొత్తాన్ని రెండు విడతల్లో చెల్లించనున్నట్లు వెల్లడించింది. దీంతో 2024లో నమోదైన వ్యాజ్యం ముగిసింది.
13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ముందు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాల్సిన ఫెడరల్ చట్టాన్ని టిక్టాక్, దాని మాతృ సంస్థ బైట్డ్యాన్స్ ఉల్లంఘించాయని అమెరికా న్యాయ శాఖ ఆరోపించింది. పిల్లల భద్రత, వ్యక్తిగత సమాచార పరిరక్షణ తమ బాధ్యత అని అమెరికా అధికారులు పేర్కొన్నారు. ఇదే సమయంలో టిక్టాక్ అమెరికా వ్యాపార నిర్మాణంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఒరాకిల్, సిల్వర్ లేక్, ఎంజీఎక్స్ వంటి పెట్టుబడిదారులతో కొత్త టిక్టాక్ యూఎస్ జాయింట్ వెంచర్ ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయి.
పిల్లల భద్రత, గోప్యత అంశాలపై సోషల్ మీడియా సంస్థలు వరుస కేసులు ఎదుర్కొంటున్న సమయంలో టిక్టాక్ తాజా రాజీ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటాపై కూడా COPPAతో పాటు వివిధ రాష్ట్ర చట్టాల ఉల్లంఘనకు సంబంధించిన ఆరోపణలపై న్యాయపరమైన విచారణలు కొనసాగుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!