
టెక్నాలజీ

జేసీ ప్రభాకర్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా స్పందించారు. తాడిపత్రిలో పలు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన.. ఈ వ్యవహారాలపై సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
తాడిపత్రిలో జరుగుతున్న అక్రమ మద్యం, గంజాయి, పేకాట వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ నేతలతో కమిటీ ఏర్పాటు చేయడం కంటే మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్తో కమిటీ వేయాలని సూచించారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలోనే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వ్యంగ్యంగా పోలీస్ స్టేషన్కు జేసీ ప్రభాకర్రెడ్డి పేరు పెట్టాలని వ్యాఖ్యానించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!