
బిజినెస్

ఈ20 పెట్రోల్ అమలుపై దేశవ్యాప్తంగా వాహనదారుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయంపై వెనక్కు తగ్గబోదని మరోసారి స్పష్టం చేసింది. పార్లమెంట్లో మాట్లాడిన కేంద్ర మంత్రి సురేష్ గోపి, ఈ20 పెట్రోల్ పూర్తిగా సురక్షితమని పేర్కొంటూ ఇథనాల్ లేని స్వచ్ఛమైన పెట్రోల్ సరఫరాను తిరిగి ప్రారంభించే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని వెల్లడించారు.
అదే సమయంలో ప్రస్తుతం అమలులో ఉన్న 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని మరింత పెంచే నిర్ణయం కూడా ఇప్పటివరకు తీసుకోలేదని మంత్రి వివరించారు. దేశంలో ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, పర్యావరణ హిత ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం, దేశీయ ఇథనాల్ ఉత్పత్తిని పెంచడం వంటి లక్ష్యాలతో ఈ20 విధానాన్ని కొనసాగిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!