

టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్లో వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కొత్త చిత్రం ‘వడ్డీ కాసులవాడ’ గురించి కీలక వివరాలను వెల్లడించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రవి మోహన్తో కలిసి ఈ ప్రత్యేక చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు మనోజ్ తెలిపారు. ఈ సినిమాలో రవి మోహన్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర పాత్రలో కనిపించనున్నారని స్పష్టం చేశారు.
తమిళం, తెలుగు భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాను భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందిస్తున్నట్లు మనోజ్ చెప్పారు. దేశవ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారని, అందుకే ఈ కథను దేశంలోని ప్రేక్షకులందరికీ చేరువయ్యేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ తమ అందరికీ ఎంతో ప్రత్యేకమైనదని మనోజ్ పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!