
గాసిప్స్

నందమూరి బాలకృష్ణ సంపూర్ణ ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని కోరుతూ అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ మోపురి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ పంచముఖ మృత్యుంజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం పరమేశ్వరుడికి, అఘోర వీరభద్రస్వామికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం మృత్యుంజయ హోమం చేపట్టారు.
ఇటీవల కాకినాడలో సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ గాయపడటంతో ఆయన ఆరోగ్యం కోసం ఈ పూజలు నిర్వహించినట్లు అభిమానులు తెలిపారు. బాలకృష్ణ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి షూటింగ్లో పాల్గొనాలని వారు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మనీ, వెంకట్ రెడ్డి, శంకర్ రెడ్డి, మంజునాథ్, కిరణ్, రాజేంద్రతో పాటు పలువురు బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!