

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు ప్రచారం చేశారనే ఆరోపణల నేపథ్యంలో నల్సార్ 2026 బ్యాచ్ విద్యార్థుల నమోదు ప్రక్రియపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) నిషేధం విధించింది. అయితే కొందరు చేసిన తప్పుకు మొత్తం విద్యార్థులను శిక్షించడం సరికాదని భావించిన బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న విద్యార్థులు, వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయుల వివరాలతో నివేదిక ఇవ్వాలని యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఆదేశించింది.
బీసీఐ నిర్ణయాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్తో పాటు నల్సార్ యాజమాన్యం కూడా తప్పుబట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా నల్సార్ విద్యార్థులకు లేఖ రాసి క్షమాపణలు తెలిపారు. కొందరి చర్యలకు మొత్తం విద్యార్థి సమాజాన్ని బాధ్యులను చేయడం సరైన విధానం కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఈ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!