

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహానికి సంబంధించిన వివరాలను ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ నెల 24న వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థం జరగనుండగా, నవంబర్ 25న వివాహ వేడుక నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 5న రిసెప్షన్ కార్యక్రమం ఉంటుందని షర్మిలా పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో తమ కుటుంబంలో మరో సంతోషకరమైన సందర్భం ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు.
తొలి వివాహ ఆహ్వాన పత్రికను కుటుంబ సభ్యులు, రఘురామ్ రెడ్డి తల్లిదండ్రులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నట్లు షర్మిలా తెలిపారు. అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డిల దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. వైఎస్సార్ దీవెనలు తమ పిల్లల జీవితాలకు కొండంత అండగా ఉంటాయని, ఆయన చూపిన సన్మార్గం వారికి ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తుందని షర్మిలా పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!