
బిజినెస్

శంషాబాద్ నుంచి భోగాపురం (విశాఖపట్నం) వెళ్లాల్సిన ఇండిగో విమానానికి మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో బాంబులు ఉన్నాయంటూ ఈమెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులతో రన్వే వైపు బయలుదేరిన విమానాన్ని నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదు. దీంతో విమానం సురక్షితమేనని నిర్ధారించిన అనంతరం సుమారు రెండు గంటల ఆలస్యంగా టేకాఫ్ తీసుకుంది. బాంబు బెదిరింపు ఈమెయిల్పై అధికారులు దర్యాప్తు చేపట్టారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!