

ఉత్తర్ప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాకు చెందిన సంజీవ్ కుమార్, అనిల్ కుమార్ అనే సోదరులు భక్తికి, తల్లిదండ్రులపై ప్రేమకు ప్రతీకగా నిలిచారు. వయోవృద్ధులైన తమ తల్లిదండ్రులను కావడిలో మోస్తూ కావడి యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా హరిద్వార్లో గంగాజలాలను సేకరించిన అనంతరం తిరుగు ప్రయాణంలో దాదాపు 200 కిలోమీటర్లు నడుస్తూ తల్లిదండ్రులను కావడిలో మోసుకెళ్లారు. వారిని చూసిన తోటి యాత్రికులు సోదరులను ‘కలియుగ శ్రవణకుమారులు’గా ప్రశంసించారు.
తల్లిదండ్రులపై తమకున్న ప్రేమ, బాధ్యతను చాటిన సంజీవ్, అనిల్.. శివుడిని ప్రత్యేకంగా ఎలాంటి వరమూ కోరుకోలేదని తెలిపారు. అమ్మానాన్నలకు సేవ చేయడమే తమకు అత్యున్నత తీర్థయాత్ర అని పేర్కొన్నారు. వారి భక్తి, తల్లిదండ్రుల పట్ల చూపిన గౌరవం తోటి యాత్రికులను ఆకట్టుకుంది. ఈ ఘటన తల్లిదండ్రుల సేవ, కుటుంబ విలువల ప్రాధాన్యాన్ని మరోసారి చాటిచెప్పింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!