

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన చార్జ్షీట్ దాదాపు 20 వేల పేజీల మేర ఉందని సీబీఐ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు వెల్లడించింది. చార్జ్షీట్ను కోర్టు రికార్డులోకి తీసుకోగా, దానికి సంబంధించిన అనుబంధ పత్రాలు (అనెక్సర్లు) దాఖలు చేసేందుకు సీబీఐకి అదనపు గడువు మంజూరు చేసింది. చార్జ్షీట్లో దర్యాప్తు సందర్భంగా సేకరించిన పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, స్వాధీనం చేసుకున్న ఆధారాల వివరాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది.
చార్జ్షీట్లో ప్రస్తావించిన పత్రాలు, సాక్ష్యాలపై కోర్టు వివరణ కోరగా, దాదాపు 20 వేల పేజీల అనెక్సర్లు ప్రస్తుతం స్కానింగ్ ప్రక్రియలో ఉన్నాయని సీబీఐ తెలిపింది. వాటిని రికార్డులో సమర్పించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరింది. సీబీఐ అభ్యర్థనను అంగీకరించిన కోర్టు గడువు మంజూరు చేస్తూ, కేసు తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!