
జనరల్

ప్రాణాంతక గడ్డి మందు పారాక్వాట్పై కేంద్ర ప్రభుత్వం తాజా నోటిఫికేషన్ జారీ చేస్తూ దేశవ్యాప్తంగా పూర్తి నిషేధం విధించింది. విదేశీ వాణిజ్య విధానంలో చేసిన సవరణలతో ఈ కొత్త నిబంధనలు 30 రోజుల్లో అమల్లోకి రానున్నాయి. ప్రమాదకర వ్యవసాయ రసాయనాలపై నియంత్రణను మరింత కఠినతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రపంచంలోని 70కి పైగా దేశాల్లో ఇప్పటికే నిషేధితమైన పారాక్వాట్ వాడకం రైతుల్లో క్యాన్సర్, నాడీ సంబంధిత వ్యాధులు, విషప్రభావాలకు కారణమవుతోందని అధ్యయనాలు వెల్లడించాయి. పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం కలిగించే ఈ రసాయనాన్ని పూర్తిగా నిషేధించడం ద్వారా ప్రజారోగ్యం, రైతుల భద్రతను కాపాడటమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!