
జనరల్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని తన నివాసం నుంచి సచివాలయానికి ప్రతిరోజూ ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కాన్వాయ్కు మార్గం కల్పించేందుకు ట్రాఫిక్ ఆంక్షలు విధించాల్సి రావడంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని సమాచారం. దీనిని దృష్టిలో ఉంచుకుని సచివాలయానికి సమీపంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం ‘వేద నిలయం’ను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
సుమారు రూ.350 కోట్ల విలువైన ఈ భవనాన్ని కొనుగోలు చేసి అధికార నివాసంగా ఉపయోగించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కొనుగోలు లేదా నివాస మార్పుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!