
జనరల్

మాజీ మంత్రి, మాజీ లోక్సభ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణంపై అన్ని రాజకీయ పార్టీల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనను ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాడిన నాయకుడిగా కొనియాడుతూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ముద్రగడకు ఘన నివాళులు అర్పించారు. కాపు వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, ప్రజాసేవలో చూపిన నిబద్ధత, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ, ఆయన మరణం ప్రజా జీవితానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!