
జనరల్

కేంద్ర ప్రభుత్వం, సీజేపీ మధ్య నేడు మధ్యాహ్నం 2 గంటలకు మూడో విడత చర్చలు జరగనున్నాయి. కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం కనుగొనే ప్రయత్నాల్లో భాగంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి ముందు సీజేపీ తన మూడు ప్రధాన డిమాండ్లను మరోసారి కేంద్రం ముందుంచింది. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంలో ఎలాంటి రాజీకి అవకాశం లేదని స్పష్టం చేసింది.
ఈ సమావేశం అనంతరం సీజేపీ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ఈ చర్చల ఫలితం ఇరు వర్గాల తదుపరి చర్యలపై ప్రభావం చూపే అవకాశముండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!