
జనరల్
.jpg.webp)
దేశంలో కమర్షియల్ గ్యాస్ సరఫరాను కేంద్ర ప్రభుత్వం పెంచింది. సుమారు 70 శాతం వరకు గ్యాస్ సరఫరా పెరగడంతో పరిశ్రమలకు కొంత ఊరటన లభించింది. విదేశాల నుంచి గ్యాస్ నౌకలు వస్తుండటంతో ఇంధన కొరత కూడా కొంత తగ్గే అవకాశం ఉంది.
ఈ విషయంపై కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలకు లేఖ పంపించారు. గ్యాస్ సరఫరా పెరగడంతో పరిశ్రమలు ఎలాంటి అంతరాయం లేకుండా పని చేయగలవని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన అవసరాలను తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
స్టీల్, ఆటోమొబైల్, రంగులు, రసాయనాలు, ప్లాస్టిక్ వంటి పరిశ్రమలకు ముందుగా గ్యాస్ అందించనున్నారు. ఈ నిర్ణయం వల్ల పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటు లభించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!