

కర్ణాటకలో సెప్టెంబర్ 30 నుంచి సినిమా టికెట్లపై అదనంగా 2 శాతం సంక్షేమ సెస్సు అమల్లోకి రానుంది. సినిమా, సాంస్కృతిక రంగాల్లో పనిచేసే కార్మికులు, కళాకారుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసే నిధికి ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. మల్టీప్లెక్స్లతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో విక్రయించే టికెట్లకు ఈ సెస్సు వర్తించనుంది. ఉదాహరణకు రూ.300 టికెట్పై 2 శాతం సెస్సు విధిస్తే అదనంగా రూ.6 చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఈ అదనపు సెస్సును మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) వ్యతిరేకిస్తోంది. టికెట్ ధరలు పెరగడం వల్ల ప్రేక్షకులపై భారం పెరిగి, థియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉందని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే జీఎస్టీ వర్తిస్తున్న టికెట్లపై మరో సెస్సు విధించడం వల్ల ‘పన్నుపై పన్ను’ ప్రభావం ఏర్పడుతుందని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరిన MAI.. అవసరమైతే న్యాయపరమైన మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. సెస్సు వసూలు విధానానికి సంబంధించిన తుది నిబంధనలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!