
జనరల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 28న నల్లగొండ జిల్లాకు పర్యటించనున్నారు. రూ.13 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్ అండ్ బి హ్యామ్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను సమీక్షించారు. సీఎం హైదరాబాద్ నుండి హెలికాప్టర్లో బయలుదేరి కనగల్ మండలానికి చేరుకుని మధ్యాహ్నం 3:30 గంటలకు ఏఎంసీ మార్కెట్ యార్డులో హ్యామ్ రోడ్ల పైలాన్ను ఆవిష్కరించనున్నారు.
అనంతరం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొదటి దశ తాగునీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత ఎన్జీ కాలేజీ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. అనంతరం స్వయం సహాయక మహిళా సంఘాలకు చెక్కులను అందజేయనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!