

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మీడియాతో చిట్చాట్లో రాష్ట్ర ప్రభుత్వంపై పలు అంశాల్లో విమర్శలు చేశారు. నాదర్గుల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, సల్కం చెరువు ఆక్రమణలపై కూడా పోరాటం చేస్తామని తెలిపారు. పట్టణాభివృద్ధి, పర్యావరణ సంబంధిత అంశాల్లో లోపాలపై వర్క్షాప్ నిర్వహిస్తామని, ఆగస్టు 15 తర్వాత పార్టీ ఉద్యమ కార్యాచరణను వెల్లడిస్తామని చెప్పారు. రంగనాథ్, జయేష్ రంజన్లకు సంబంధించి హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎగ్జిక్యూటివ్ ఫెయిల్యూర్ వల్ల అభివృద్ధి ఆగిపోతోందని విమర్శించారు. ఎంపీలు పార్టీకి మరింత సమర్థంగా ఎలా ఉపయోగపడాలన్న అంశంపై నితిన్ నబీన్తో సమావేశం జరిగిందని తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని సాధారణంగా రెండేళ్ల తర్వాత మార్చే అవకాశం ఉంటుందని రామచందర్ రావు అన్నారు. SIR ద్వారా కొత్త ఓటర్ల జాబితా వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. E20 పెట్రోల్పై గతంలో కాంగ్రెస్ నేతలు అనుకూలంగా మాట్లాడారని, ఇప్పుడు దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎల్నినో పరిస్థితులు ఉన్న విషయం తెలిసినా వరుణ యాగాన్ని వర్షాకాలం ముగింపులో నిర్వహిస్తున్నారని విమర్శించారు. అలాగే ఢిల్లీలో వివిధ లెఫ్ట్ సంఘాలు జెన్-జీ పేరుతో ఆందోళనలు చేశాయని ఆరోపించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!