

భారత ఆర్మీ నిర్వహించే వివిధ నియామకాల్లో తెలంగాణ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి. రాజేష్ పుష్కర్ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాల్లో యువత కోసం శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆర్మీ నియామకాలకు వారిని సిద్ధం చేయాలని సీఎం సూచించారు. దేశవ్యాప్తంగా జరిగే నియామకాలకు ముందు తెలంగాణలో శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ సుముఖత వ్యక్తం చేశారు.
సమావేశంలో విపత్తు నిర్వహణలో ఆర్మీ పాత్రపైనా సీఎం చర్చించారు. తెలంగాణలో వరదలు, ఇతర విపత్తుల సమయంలో సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్లు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కార్యక్రమాల్లో ఆర్మీ మరింత చురుకుగా పాల్గొనాలని కోరారు. రాష్ట్రంలో విపత్తు పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని స్థానిక ఆర్మీ అధికారులకు సూచిస్తానని లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ఆయన అభినందించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!