

మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజలకు ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ఆయన కోరారు. ముఖ్యంగా యువతలో సానుకూల ఆలోచనలు, మంచి విలువలు పెంపొందించి డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్య సాధనకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
మాదక ద్రవ్యాలు వ్యక్తుల జీవితాలను మాత్రమే కాదు, కుటుంబాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయని సీఎం తెలిపారు. దీని వల్ల సమాజంలో శాంతిభద్రతల సమస్యలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. డ్రగ్స్ నియంత్రణ, అక్రమ రవాణా అరికట్టడంలో ప్రజల అవగాహన, అప్రమత్తత మరియు సామాజిక బాధ్యత ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన తెలంగాణ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!