
జనరల్

ప్రముఖ నటుడు, దర్శకుడు భారతీరాజా మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో దర్శకుడిగా, నటుడిగా భారతీరాజా తనదైన ముద్ర వేశారని ఆయన గుర్తు చేశారు.
వివిధ భాషల్లో ఎన్నో వైవిధ్యభరితమైన, సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించి భారతీయ చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలందించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భారతీరాజా మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!