
క్రీడలు

రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడిన రైతు నాయకుడు, కమ్యూనిస్టు నేత సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైతుల హక్కులు, వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం మల్లారెడ్డి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారని గుర్తుచేశారు. రైతు సంఘం నేతగా, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
భూమి హక్కులు, సాగునీరు, వ్యవసాయ రుణాలు, విత్తనాలు తదితర అంశాలపై మల్లారెడ్డి నిరంతరం పోరాడుతూ తన జీవితాన్ని రైతుల సంక్షేమానికి అంకితం చేశారని సీఎం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులు, అభిమానులకు రేవంత్రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!