

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ పేరు చెప్పగానే గుర్తొచ్చే ‘మన్నత్’లో ప్రస్తుతం భారీ రీడెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి. ముంబై బాంద్రాలో సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ ఐకానిక్ భవనంలోని అనెక్స్లో మరో రెండు అంతస్తులను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీంతో భవనం నిర్మిత విస్తీర్ణం 616.02 చదరపు మీటర్లు పెరగనుంది. ఈ విస్తరణకు సుమారు రూ.25 కోట్లు ఖర్చవుతుందని అంచనా. సముద్రానికి సమీపంలో ఉండటంతో మన్నత్ విస్తరణకు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) అనుమతులు కూడా అవసరమయ్యాయి. ఈ అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను జులైలో సుప్రీంకోర్టు కొట్టివేయడంతో రీడెవలప్మెంట్కు మార్గం సుగమమైంది.
ఇక మన్నత్కు ముందే షారుక్ ముంబైలో కొనుగోలు చేసిన తొలి ప్రాపర్టీ అయిన బాంద్రాలోని శ్రీ అమృత్ సొసైటీ ఫ్లాట్ కూడా ప్రస్తుతం రీడెవలప్ అవుతోంది. గౌరీ ఖాన్ను వివాహం చేసుకున్న తర్వాత 1991లో ఈ ప్రాపర్టీని షారుక్ కొనుగోలు చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. రీడెవలప్మెంట్ పూర్తయిన తర్వాత ఆయనకు సుమారు 2,800 చదరపు అడుగుల 4BHK సముద్రాభిముఖ ఫ్లాట్ లభించనున్నట్లు సమాచారం.
సినిమాల విషయానికొస్తే.. షారుక్ ఖాన్ ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన కుమార్తె సుహానా ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రం 2026 డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!