
జనరల్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని, వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో వైఎస్సార్ ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని సీఎం గుర్తుచేశారు.
రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, పేదలకు గృహ నిర్మాణం, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా వైఎస్సార్ లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!