
జనరల్

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రేపు కామారెడ్డి, ములుగు, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్పల్లికి చేరుకుని, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ విందుకు హాజరవుతారు. అనంతరం ములుగు జిల్లా మేడారం చేరుకుని వనదేవతలు సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకుంటారు.
తర్వాత ములుగు పట్టణంలోని గట్టమ్మ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించి, కొత్త కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి హనుమకొండ జిల్లా పరకాలకు చేరుకుని వివిధ శాఖల అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!