
గాసిప్స్

ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1937లో ఉన్న విధంగా ‘వందేమాతరం’లోని రెండు చరణాలను మాత్రమే పాడాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. అలాగే లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల సంఖ్యను కొనసాగించాలని డిమాండ్ చేసింది.
ప్రస్తుత లోక్సభ స్థానాల పరిధిలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని సీడబ్ల్యూసీ కోరింది. చైనా ఆక్రమణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది. విద్యార్థుల సమస్యలు, అయోధ్య విరాళాల అంశాలపై పోరాటం కొనసాగించాలని కూడా నిర్ణయించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!