
జనరల్

తెలంగాణ పోలీస్శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. ట్రాఫిక్, రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ 513 మంది పోలీసులకు కొత్త బాధ్యతలు, బదిలీలు చేపట్టినట్లు డీజీపీ తెలిపారు. ఇందులో 224 మంది సిబ్బందిని ట్రాఫిక్, రోడ్డు భద్రత విభాగాలకు కేటాయించారు. 11 రోజుల ప్రత్యేక శిక్షణ అనంతరం వారు కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆహార కల్తీ, డ్రగ్ కంట్రోల్కు 80 మంది సిబ్బందిని కేటాయించారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. సైబర్ నేరాల కారణంగా తెలంగాణలో రూ.1,750 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. నేరాలను సమర్థంగా అరికట్టేందుకు పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!