
జనరల్

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. పంజాగుట్ట పోలీసులు ఆయనపై నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసును హైకోర్టు కొట్టివేసింది. తనపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ రేగా కాంతారావు చేసిన వాదనను పరిశీలించిన కోర్టు, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసింది.
ఈ కేసుకు సంబంధించిన పోలీసుల ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో రేగా కాంతారావుకు ఈ కేసులో ఊరట లభించినట్లైంది. కోర్టు తీర్పుతో ఆయనపై కొనసాగుతున్న కేసు ప్రక్రియకు ముగింపు లభించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!