

కానిస్టేబుల్ ఉద్యోగాల అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు లోనై ఆందోళనలకు దిగొద్దని ఏపీ హోంమంత్రి అనిత సూచించారు. పోలీసు ఉద్యోగాలు ఏ ప్రభుత్వ హయాంలో వచ్చాయో అభ్యర్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్లో భాగంగా 11 వేల పోలీసు పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. 2014-19 మధ్య 9,793 పోలీసు పోస్టులను భర్తీ చేశామని అనిత పేర్కొన్నారు.
గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఒక్క కానిస్టేబుల్ పోస్టు కూడా భర్తీ చేయలేదని అనిత ఆరోపించారు. నోటిఫికేషన్ ఇచ్చిన 6 వేల పోలీసు పోస్టులను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించామని తెలిపారు. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనలతో తమ భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని సూచించారు. కానిస్టేబుళ్ల స్టైఫండ్ను రూ.12 వేలకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని హోంమంత్రి అనిత అన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!