
రాజకీయాలు

జూన్ 6న "కాక్రోచ్ జనతా పార్టీ" నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి సంబంధించి భద్రతా, జనసమ్మర్థ నియంత్రణ ఏర్పాట్లు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ను సేవ్ ఇండియా ఫౌండేషన్ దాఖలు చేసింది.
జస్టిస్ సౌరభ్ బెనర్జీ, జస్టిస్ అమిత్ శర్మల ధర్మాసనం ముందు ఈ అంశాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. అయితే ధర్మాసనం ఈ అభ్యర్థనను అంగీకరించకుండా, తక్షణ విచారణకు నిరాకరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!