

నీట్ రీ-ఎగ్జామ్కు ముందు టెలిగ్రామ్ యాప్పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. శుక్రవారం జరిగిన విచారణలో, అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఎలాంటి తప్పు కనిపించడం లేదని కోర్టు స్పష్టం చేసింది. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం కేంద్ర ప్రభుత్వం అవసరమైన విధానాలను అనుసరించిందని పేర్కొంది.
దేశంలో అత్యంత పోటీ ఉన్న ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీట్కు ప్రతి ఏడాది 20 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతారు. ఇటీవల ప్రశ్నపత్రం లీక్ అయ్యిందన్న ఆరోపణలు, కొన్ని టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టిందన్న వార్తల నేపథ్యంలో కేంద్రం జూన్ 21న జరగనున్న రీ-ఎగ్జామ్కు ముందు టెలిగ్రామ్ యాక్సెస్ను నిలిపివేసింది. పరీక్షల పారదర్శకత, నిష్పాక్షికతను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని హైకోర్టు అభిప్రాయపడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!