
జనరల్

మెట్రో రైల్ ప్రయాణీకులు సురక్షితంగా, సులభంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. హెచ్ఎంఆర్ఎల్ బోర్డు అఫ్ డైరెక్టర్ల చైర్మన్గా ఆయన తొలిసారి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, మెట్రో నిర్వహణ, అభివృద్ధి అంశాలను సమీక్షించారు. ఈ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది.
మెట్రో, ఆర్టీసీ సేవలను ఒకే టికెట్తో ఉపయోగించే విధానంపై ప్రణాళిక రూపొందించాలని, టీజీఎస్ఆర్టీసీతో కలిసి ఉమ్మడి యాప్ అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రయాణీకులకు రోజువారీ, నెలవారీ పాస్లను ప్రవేశపెట్టాలని, అదనపు బోగీలను త్వరగా సమీకరించాలని అధికారులకు ఆదేశించారు. మెట్రో మొదటి దశ, రెండవ దశ పురోగతిని కూడా సమీక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!