
టెక్నాలజీ

మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిన అనంతరం మాజీ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. కేసు ప్రారంభమైన తొలి రోజే ఆరోపణలు లేదా అభియోగాలు రుజువైతే తాను అత్యంత కఠిన శిక్షకైనా సిద్ధమని చెప్పానని ఆయన గుర్తు చేశారు. కోర్టు తీర్పు తన వైఖరిని సమర్థించిందని పేర్కొన్నారు.
కోర్టు తనకు గౌరవప్రదంగా విముక్తి కల్పించిందని బ్రిజ్ భూషణ్ అన్నారు. ఈ తీర్పు తనకు మాత్రమే కాకుండా తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ సంతోషకరమైన రోజని వ్యాఖ్యానించారు. న్యాయ ప్రక్రియపై తనకు విశ్వాసం ఉందని, తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!