
జనరల్

సుస్థిర రవాణా వ్యవస్థ దిశగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డా. మోహన్ యాదవ్ మరో కీలక అడుగు వేశారు. తన అధికారిక కాన్వాయ్లో మహీంద్రా XEV 9e ఎలక్ట్రిక్ వాహనాన్ని చేర్చడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, పరిశుభ్రమైన రవాణా వ్యవస్థకు తన మద్దతును చాటిచెప్పారు. ప్రభుత్వ స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నంగా ఈ నిర్ణయం నిలుస్తోంది.
“వికసిత భారత్ 2047” లక్ష్యానికి అనుగుణంగా తీసుకున్న ఈ నిర్ణయం గ్రీన్ మొబిలిటీకి కొత్త ఊపునివ్వనుంది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడం ద్వారా పర్యావరణహిత అభివృద్ధిని సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజల్లోనూ, ప్రభుత్వ శాఖల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెంచే దిశగా ఇది ఒక స్ఫూర్తిదాయక చర్యగా నిలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!