
జనరల్

విశాఖపట్నం సాగర తీరంలో తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు నమోదవడంతో, గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా మేల్కొని ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అధికారుల ప్రకారం, ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. భూకంప కేంద్రం బంగాళాఖాతంలో భూమి అంతర్భాగంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది. సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, మాధవధార, ఈస్ట్ పాయింట్ కాలనీ, సీతమ్మధార, పెదవాల్తేరు, హెచ్బీ కాలనీ ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా అనిపించాయి. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!