
సినిమాలు

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తానని చెప్పి ఓ దళారి పలువురు భక్తులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిమ్మల శ్రీనివాసులు అనే వ్యక్తి సుమారు 60 మంది భక్తుల నుంచి రూ.4.22 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో వ్యక్తి నుంచి రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు తీసుకుని దర్శనం ఏర్పాట్లు చేస్తానని నమ్మించినట్లు బాధితులు తెలిపారు.
డబ్బులు వసూలు చేసిన అనంతరం అతను ఫోన్ స్విచ్చాఫ్ చేసి అందుబాటులో లేకపోవడంతో మోసపోయినట్లు భక్తులు గుర్తించారు. గుంటూరు, హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాలకు చెందిన బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!