

పశ్చిమ బెంగాల్లో మాజీ టీఎంసీ ఎమ్మెల్యే, సీనియర్ నేత ఆశిష్ బెనర్జీ మృతి చెందారు. బీర్భూమ్ జిల్లా రాంపూర్హాట్లోని తన నివాసానికి ఆనుకుని ఉన్న పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం ఆయన మృతదేహం వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మరణానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించేందుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అది ఆశిష్ బెనర్జీ రాసినదేనా, దాని నేపథ్యంలో ఏముందనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీర్భూమ్ జిల్లాలో టీఎంసీకి చెందిన ప్రముఖ నేతల్లో ఆశిష్ బెనర్జీ ఒకరు. ఆయన రాంపూర్హాట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా, రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన మృతిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర ఆధారాల ఆధారంగా మరణానికి దారితీసిన పరిస్థితులను నిర్ధారించనున్నట్లు అధికారులు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!