
క్రీడలు

అమెరికా–ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన శాంతి ఒప్పందం తర్వాత హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఎలాంటి ఆటంకాలు లేకపోవడంతో భారత్కు చెందిన అనేక నౌకలు కూడా ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం మరో 30 భారతీయ నౌకలు హర్మూజ్ జలసంధి మార్గం ద్వారా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే సింగపూర్కు చెందిన ఒక నౌకపై ఇరాన్ దాడి చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. తమ సూచనలను పాటించని నౌకలపై చర్యలు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై అమెరికా ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. దాడి జరిగినట్లు కూడా ధృవీకరించలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!