
జనరల్

హైదరాబాద్ బేగంబజార్లో వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ స్వర్ణ గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫీల్ఖానాలో కొలువుదీరిన ఈ విగ్రహాన్ని 48 కిలోల బంగారంతో రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 3.83 లక్షల అమెరికన్ డైమండ్స్తో పాటు 24 క్యారెట్ల బంగారు పూతతో విగ్రహాన్ని అలంకరించారు. నిపుణులైన కళాకారుల హస్తకళా నైపుణ్యంతో ఈ ప్రత్యేక గణపతి విగ్రహాన్ని రూపొందించారు.
ప్రసిద్ధ లాల్బాగ్చా రాజా, తిరుపతి బాలాజీ రూపాల నుంచి స్ఫూర్తి పొంది ఈ స్వర్ణ గణనాథుడిని తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వర్ణ గణపతిని దర్శించుకుంటున్నారు. ఈ విగ్రహం దేశంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన గణపతి విగ్రహాల్లో ఒకటిగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!