

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అస్వస్థతకు గురికావడంతో కర్ణాటకలోని హుబ్బళ్లిలో శనివారం జరిగిన కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. షెడ్యూల్ ప్రకారం రూ.700 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన కేఎల్ఈ జగద్గురు గంగాధర్ మహాస్వామిగళు మూరుసావిరమఠ్ మెడికల్ కాలేజీ నూతన భవనం, 1,200 పడకల కేఎల్ఈ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ను ఆయన ప్రారంభించాల్సి ఉంది. శుక్రవారం రాత్రి హుబ్బళ్లికి చేరుకున్న అమిత్ షా.. అనారోగ్యానికి గురికావడంతో వైద్యుల సూచన మేరకు హోటల్లోనే విశ్రాంతి తీసుకున్నారు.
అమిత్ షా గైర్హాజరైన నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తదితరులు నూతన భవనాలు, ఆసుపత్రిని ప్రారంభించారు. కేఎల్ఈ సొసైటీ ఛైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు ప్రభాకర్ కోరే.. ఆరోగ్య కారణాల వల్ల అమిత్ షా కార్యక్రమానికి దూరంగా ఉన్నారని వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని అధికారిక వైద్య వివరాలు వెల్లడించాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!