

విజయ్ దేవరకొండను పెళ్లాడిన తర్వాత తన జీవితంలో పెద్దగా మార్పేమీ రాలేదని నటి రష్మిక మందన్నా తెలిపారు. కెరీర్ పతాకస్థాయిలో ఉన్న సమయంలో వివాహం చేసుకున్నప్పటికీ.. తన వృత్తిపరమైన ప్రయాణం యథావిధిగానే కొనసాగుతోందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. విజయ్తో కలిసి ఎదిగామని, తోటి నటులుగా పరిచయమై బెస్ట్ ఫ్రెండ్స్గా మారి ఇప్పుడు జీవిత భాగస్వాములమయ్యామని చెప్పారు. విజయ్ ఎంతో సున్నితమైన మనసున్న వ్యక్తి అని, సెట్లో పని పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటారని, బయట మాత్రం చాలా ఆప్యాయంగా ఉంటారని రష్మిక వివరించారు.
స్టార్డమ్తో వచ్చే ఒత్తిడి గురించి కూడా రష్మిక స్పందించారు. ఎప్పుడూ స్పాట్లైట్లో ఉండటం తలపై తుపాకీ గురిపెట్టినట్లుగా అనిపిస్తుందని అన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ప్రస్తుతం రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతున్నట్లు తెలిపారు. సినిమాల విషయానికొస్తే.. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘రణబాలి’ షూటింగ్ పూర్తవగా, ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మైసా’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎం.ఎస్.సుబ్బులక్ష్మి అమ్మ’ బయోపిక్లోనూ రష్మిక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!