

రాష్ట్రంలో ఇంజినీరింగ్ బోధన ఫీజుల చెల్లింపు విషయంలో బీసీ, ఈబీసీ విద్యార్థులకు మరింత ప్రయోజనం కల్పించేలా ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ర్యాంకు సీలింగ్ కారణంగా పలువురు పేద విద్యార్థులు నాణ్యమైన కళాశాలల్లో చదవలేకపోతున్న నేపథ్యంలో ఈ పరిమితిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయంపై ఖజానాపై పడే అదనపు భారాన్ని లెక్కించి నివేదిక ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
గతంలో ర్యాంకు పరిమితి లేకుండా ఫీజులు చెల్లించగా, ఆ తర్వాత బీసీ, ఈబీసీ విద్యార్థులకు ర్యాంకు సీలింగ్ విధించారు. ప్రస్తుతం టాప్ కాలేజీల ఫీజులు భారీగా పెరిగిన నేపథ్యంలో విద్యార్థులు సొంతంగా భారం మోస్తున్నారు. సీలింగ్ను 10 వేల నుంచి 20 వేల ర్యాంక్ వరకు పెంచితే ఎంత ఆర్థిక భారం వస్తుందో ప్రభుత్వం అంచనా వేస్తోంది. నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!