

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావంతో మార్కెట్లో ఒడిదుడుకులు కనిపించాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగించడం నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ షేర్లపై ఒత్తిడి కొనసాగింది.
రోజు ముగిసే సమయానికి సెన్సెక్స్ 152.05 పాయింట్లు పెరిగి 78,581 వద్ద, నిఫ్టీ 9.75 పాయింట్లు లాభపడి 24,624.65 వద్ద ముగిశాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండిగో, కోటక్ బ్యాంక్ షేర్లు లాభపడగా, టీసీఎస్, హెచ్సీఎల్టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బీఈఎల్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 95.13 వద్ద ట్రేడవగా, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 80.69 డాలర్లు, బంగారం ఔన్స్ ధర 4,152.30 డాలర్లు వద్ద కొనసాగింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!