
క్రీడలు

హజ్ 2027 యాత్రకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఈసారి తెలంగాణ రాష్ట్రానికి 6,684 మంది యాత్రికుల కోటా కేటాయించినట్లు హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రో పాషా వెల్లడించారు. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.
హజ్ 2027 కోసం దరఖాస్తుల స్వీకరణ జూలై 20 వరకు కొనసాగనుంది. 65 సంవత్సరాలు దాటిన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం నేరుగా ఎంపిక చేసే అవకాశం కల్పించనున్నట్లు ఖుస్రో పాషా తెలిపారు. యాత్రికులు అవసరమైన పత్రాలు సక్రమంగా సమర్పించి, దరఖాస్తు ప్రక్రియను గడువు ముగియకముందే పూర్తి చేయాలని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!