

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో 17.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై ఈ ఏడాదిలో అత్యధిక వర్షపాతంగా నిలిచింది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
ఇదిలా ఉండగా, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు రోజుల పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు ఎల్నినో ప్రభావం క్రమంగా బలపడుతోందని, 2027 వరకు సముద్ర ఉష్ణోగ్రతలు, మత్స్య రంగం, తీరప్రాంతాలు, వరద పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఇన్కాయిస్ తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!